తల్లితో వివాహేతర సంబంధం... కుమార్తెపై అత్యాచారం

ABN , First Publish Date - 2020-07-06T18:19:14+05:30 IST

మహిళతో వివాహేతర సంబంధమే కాకుండా ఆమె మైనర్‌ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన

తల్లితో వివాహేతర సంబంధం... కుమార్తెపై అత్యాచారం

వనస్థలిపురం, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : మహిళతో వివాహేతర సంబంధమే కాకుండా ఆమె మైనర్‌ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే మహిళకు 2003లో వివాహం  జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. కుటుంబ కలహాల నేపథ్యంలో గత పదేళ్లుగా భర్తతో విడిపోయిన మహిళ పిల్లలతో నివాసముంటోంది.


ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం నివాసి గడుసు నరసింహయాదవ్‌ (50) అనే వ్యక్తి ఆ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. కొన్ని రోజులుగా కుమార్తె నలతగా ఉండడంతో ఏం జరిగిందని తల్లి ప్రశ్నించింది. గత నెల 22న నరసింహ తనను బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక చెప్పింది. ఆదివారం బాధితురాలు, తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2020-07-06T18:19:14+05:30 IST