ఐఐటీలో మరో 18 మందికి Covid పాజిటివ్
ABN , First Publish Date - 2022-04-26T14:58:04+05:30 IST
మద్రాసు ఐఐటీలో కొత్తగా మరో 18 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆదివారం వరకు 60 మందికి పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించిన నేపధ్యంలో, సోమవారం విడుదల
ప్యారీస్(చెన్నై): మద్రాసు ఐఐటీలో కొత్తగా మరో 18 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆదివారం వరకు 60 మందికి పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించిన నేపధ్యంలో, సోమవారం విడుదల చేసిన ప్రకటనతో ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య 78కి పెరిగింది. కరోనా మూడో దశ తగ్గుతున్న పరిస్థితుల్లో గత కొన్నిరోజులుగా హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలు సహా పలు దేశాల్లో కరోనా తీవ్రత పెరుగుతూ వస్తోంది. మద్రాసు ఐఐటీలో ఈ నెల 21న 12 మంది విద్యార్థులు, 22న 18 మంది సహా మరో రెండు రోజుల్లో మొత్తం 60 మందికి పాజిటివ్ నిర్ధారణ అయిన నేపధ్యంలో, తాజాగా మరో 18 మంది పాజిటివ్ నిర్ధారణ అయింది.