పళ్లు కలిసిన నీళ్లు తాగితే..
ABN , First Publish Date - 2022-09-22T20:59:33+05:30 IST
పళ్లు కలిసిన నీళ్లు తాగితే బడలిక తొలిగి, కొత్త ఉత్తేజం దక్కుతుంది. వేసవి తాపం, దాహం తీరడంతోపాటు ఉపశమనాన్ని అందించే ఈ హెల్తీ డ్రింక్ ఇలా తయారు చేసుకోవాలి.
పళ్లు కలిసిన నీళ్లు తాగితే బడలిక తొలిగి, కొత్త ఉత్తేజం దక్కుతుంది. వేసవి తాపం, దాహం తీరడంతోపాటు ఉపశమనాన్ని అందించే ఈ హెల్తీ డ్రింక్ ఇలా తయారు చేసుకోవాలి.
కావలసిన పదార్థాలు:
- స్ట్రాబెర్రీలు - 4
- నిమ్మకాయ - 1
- నీళ్లు - 4 గ్లాసులు
- తులసి ఆకులు - 5
- తేనె - 1 టేబుల్ స్పూను
తయారీ విధానం:
- స్ట్రాబెర్రీలు శుభ్రంగా కడిగి, ముక్కలు చేసి పెట్టుకోవాలి.
- నిమ్మకాయ చక్రాలుగా కోసుకోవాలి.
- వెడల్పాటి గిన్నెలో నీళ్లు నింపి, స్ట్రాబెర్రీ ముక్కలు, తేనె, తులసి ఆకులు వేసి కలపాలి.
- ఈ గిన్నెను ఫ్రిజ్లో 3 గంటల నుంచి 2 రోజుల వరకూ ఉంచి వాడుకోవచ్చు.