కేసీఆర్‌ను నమ్మితే తెలంగాణనే అమ్ముతాడు: షర్మిల

ABN , First Publish Date - 2022-03-23T01:49:54+05:30 IST

కేసీఆర్‌ను మళ్లీ నమ్మితే తెలంగాణనే అమ్ముతాడని వైఎస్సాఆర్ టీపీ

కేసీఆర్‌ను నమ్మితే తెలంగాణనే అమ్ముతాడు: షర్మిల

హైదరాబాద్: కేసీఆర్‌ను మళ్లీ నమ్మితే తెలంగాణనే అమ్ముతాడని వైఎస్సాఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.  ప్రజలను తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని నడుపుతున్నాడని ఆమె ఆరోపించారు. మద్యం, భూములు అమ్మి నాశనం చేస్తున్నాడన్నారు.  ఎనిమిదేండ్లు ఊరిచ్చి, 80వేల ఉద్యోగాలేనా ఇచ్చేది అని ప్రశ్నించారు. ఇంకా లక్ష ఉద్యోగాలు ప్రగతిభవన్‌పై కాకులు ఎత్తుకుపోయాయా అని మండిపడ్డారు. కేసీఆర్ నిర్లక్ష్యంతోనే నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు.  రాష్ట్రంలో నిరుద్యోగం నాలుగింతలు పెరిగిందన్నారు. నాడు ఉద్యమంలో యువత ప్రాణాలు వదిలితే.. నేడు ఉద్యోగాల కోసం వదులుతున్నారన్నారు. ఎనిమిదేండ్లు ఊరిచ్చి ఊరిచ్చి 80వేల ఉద్యోగాలు మాత్రమే ప్రకటించారు.  పీఆర్ఎసీ, బిశ్వాల్ కమిటీ ప్రకారం రాష్ట్రంలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపిందన్నారు. ఉద్యోగాల భర్తీకి తొమ్మిది నెలలు పడుతుందని కేటీఆర్ చెబుతున్నాడని ఆమె అన్నారు. 

Updated Date - 2022-03-23T01:49:54+05:30 IST