నిమిషం అలస్యమైనా ఇంటికే

ABN , First Publish Date - 2022-08-03T05:32:17+05:30 IST

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. హాజరు కానున్న విద్యార్థులు పరీక్ష సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు సృష్టం చేశారు.

నిమిషం అలస్యమైనా ఇంటికే


నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు
హాజరుకానున్న 30,237 మంది విద్యార్థులు
కలెక్టరేట్‌, ఆగస్టు 2:
ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. హాజరు కానున్న విద్యార్థులు పరీక్ష సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు సృష్టం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 48 కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 30,237 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 17,830 మంది విద్యార్థులు, రెండో సంవత్సరానికి సంబంధించి 12,407 మంది పరీక్ష రాయనున్నారు. ఫస్టియర్‌కు ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ , సెకెండియర్‌ విద్యార్థులకు మధ్యాహ్నాం 2.30 నుంచి 5.30వరకూ పరీక్ష జరగనున్నది. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్ష రాసే విద్యార్థులతోపాటు పరీక్ష నిర్వహించే సిబ్బంది కూడా సెల్‌ఫోన్‌ను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని ఆర్‌ఐవో మజ్జి ఆదినారాయణ తెలిపారు. పరీక్షల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేశామన్నారు.
--------

Updated Date - 2022-08-03T05:32:17+05:30 IST