భయపెడితే వైసీపీ నేతల తాటతీస్తా

ABN , First Publish Date - 2021-02-27T05:48:08+05:30 IST

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన సాగుతుందని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు విమర్శించారు. శుక్రవారం టీడీపీ మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలను ఇష్టానుసారంగా ఇబ్బందులు పెడుతున్నారని, ఇలా భయపెడుతుంటే ఆ నాయకుల తాటతీస్తానని, ఏ ఒక్కరిని వదిలిపెట్టమన్నారు.

భయపెడితే వైసీపీ నేతల తాటతీస్తా
సమావేశంలో మాట్లాడుతున్న గవిరెడ్డి రామానాయుడు


మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు


మాడుగుల, ఫిబ్రవరి 26: రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన సాగుతుందని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు విమర్శించారు. శుక్రవారం టీడీపీ మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలను ఇష్టానుసారంగా ఇబ్బందులు పెడుతున్నారని, ఇలా భయపెడుతుంటే ఆ నాయకుల తాటతీస్తానని, ఏ ఒక్కరిని వదిలిపెట్టమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అన్ని విధాలా ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మాట వినని టీడీపీ మద్దతుదారులపై లేనిపోని కేసులు బనాయించి అరెస్టులు చేయించారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు కావని, అవన్నీ కల్తీరత్నాలన్నారు. ఇంటింటికీ రేషన్‌ సరుకుల పంపిణీతో చలాల మందికి ఇంకా రేషన్‌ అందలేదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా టీడీపీ సత్తా చాటిందని చెప్పారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా సత్తాచాటాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పైలా ప్రసాదరావు, పుప్పాల అప్పలరాజు, పీవీజీ.కుమార్‌, పోలుపర్తి సత్యవతి, అద్దేపల్లి జగ్గారావు, తదితరులు ప్రసంగించారు. 

Updated Date - 2021-02-27T05:48:08+05:30 IST