వరవరరావు బయట ఉంటే ప్రమాదమే

ABN , First Publish Date - 2022-08-10T10:11:58+05:30 IST

విరసం నేత వరవరరావు బయట ఉంటే ప్రమాదమేనని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) స్పష్టం చేసింది.

వరవరరావు బయట ఉంటే ప్రమాదమే

సుప్రీంకోర్టులో ఎన్‌ఐఏ అఫిడవిట్‌


న్యూఢిల్లీ, ఆగస్టు 9: విరసం నేత వరవరరావు బయట ఉంటే ప్రమాదమేనని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) స్పష్టం చేసింది. ఆయన ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక విధానాలతో దేశ ఐక్యత, సమగ్రత, భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం ఈ మేరకు ఎన్‌ఐఏ ఐజీ సంతోష్‌ రస్తోగీ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. భీమా-కోరేగావ్‌ కేసులో 2018లో వరవరరావు అరెస్టయిన విషయం తెలిసిందే. సుదీర్ఘకాలం జైలులో ఉన్న ఆయన కొవిడ్‌ సమయంలో పలుమార్లు బాంబే హైకోర్టును ఆశ్రయించి, బెయిల్‌ పొందారు. అయితే, తన వయసు, ఆరోగ్యరీత్యా శాశ్వత బెయిల్‌ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత నెల 19న ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఈ నెల 10 వరకు ఆయన బెయిల్‌ను పొడిగిస్తూ.. ఎన్‌ఐఏ స్పందనను కోరింది. ఈ మేరకు ఎన్‌ఐఏ మంగళవారం అఫిడవిట్‌ను సమర్పించింది.

Updated Date - 2022-08-10T10:11:58+05:30 IST