AP News : పోలవరం నిర్మాణం చేతకాకపోతే కేంద్రానికి అప్పజెప్పాలి: రామకృష్ణ
ABN , First Publish Date - 2022-07-28T21:52:52+05:30 IST
కర్నూలు: సీపీఐ రామకృష్ణ సీఎం జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేతగాని దద్దమ్మ జగన్ ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారని రామకృష్ణ అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక కక్షసాధింపు తప్ప..
కర్నూలు: సీపీఐ రామకృష్ణ (CPI Ramakrishna) సీఎం జగన్ (CM Jagan)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేతగాని దద్దమ్మ జగన్ ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారని రామకృష్ణ అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక కక్షసాధింపు తప్ప.. చేసిందేమీ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నిర్మాణం పూర్తి చేయడం చేతకాకపోతే కేంద్రానికి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితులకు జగన్ సమాధానం చెప్పి తీరాలన్నారు. కేంద్రంతో పోరాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయించుకుంటామని రామకృష్ణ చెప్పారు.