కల్లు అమ్మకాలు చేసినా..సేవించినా జైలుపాలే

ABN , First Publish Date - 2020-03-27T05:58:30+05:30 IST

కల్లు అమ్మకాలు చేసినా, సేవించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌ అండ్‌

కల్లు అమ్మకాలు చేసినా..సేవించినా జైలుపాలే

ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సీఐ అబ్దుల్‌ జలీల్‌


నాయుడుపేట, మార్చి 26 : కల్లు అమ్మకాలు చేసినా, సేవించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సీఐ అబ్దుల్‌ జలీల్‌ అన్నారు. నాయుడుపేట ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సర్కిల్‌ పరిధిలో గురువారం ఎస్‌ఐ శేషమ్మ, సిబ్బందితో కలిసి ఆయన తనిఖీ చేపట్టారు. మండలంలోని అరవపెరిమిడి,  పుదూరు, జువ్వలపాళెం, ఓజిలి మండలంలో ఓజిలి, సగుటూరువడ్డికండ్రిగ, కురుగొండ, నెమళ్లపూడి, ఆరిమేనిపాడు, పెద్దపరియ గ్రామాల్లో గీత కార్మికులకు, గ్రామస్థులకు కొవిడ్‌-19 వైరస్‌ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. సగుటూరువడ్డికండ్రిగలో కల్లు అమ్ముతున్న గురవయ్యను, 7 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకున్నారు. అలాగే నెమళ్లపూడిలో కల్లు అమ్ముతున్న రామారావును, 5 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకుని కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సిబ్బంది రాజయ్య, భాస్కర్‌రావు, రవి ఉన్నారు. 

Updated Date - 2020-03-27T05:58:30+05:30 IST