జగన్‌ ఒక్క చిటిక వేస్తే టీడీపీ వాళ్లని తిరగనివ్వం

ABN , First Publish Date - 2022-06-27T08:16:55+05:30 IST

జగన్‌ ఒక్క చిటిక వేస్తే టీడీపీ వాళ్లని తిరగనివ్వం

జగన్‌ ఒక్క చిటిక వేస్తే టీడీపీ వాళ్లని తిరగనివ్వం

వైసీపీ ప్లీనరీలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి 

మంత్రాలయం, జూన్‌ 26: సీఎం జగన్‌ ఒక చిటికె వేయమనండి.. తెలుగుదేశం పార్టీ వారిని బయట తిరగనీయకుండా చేస్తానని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. ఆదివారం వైసీపీ ప్లీనరీని మంత్రాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తన వెంట ఉన్నంత వరకు టీడీపీ వర్గీయులు తన వెంట్రుక కూడా పీకలేరన్నారు. ‘రాఘవేంద్రస్వామి మీద ప్రమాణం వేసి చేసి చెబుతున్నా.. నా ఆస్తులన్నీ అమ్మి అయినా సరే ప్రజలకు సేవ చేస్తా’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు పోటీగా తిక్కారెడ్డి సరిపోడని చంద్రబాబు గాని, లోకేశ్‌ గాని పోటీ చేస్తే బావుంటుందని సవాల్‌ విసిరారు. ఎంపీ సంజీవకుమార్‌ తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2022-06-27T08:16:55+05:30 IST