ప్లాటు విక్రయిస్తేనే పెళ్లి చేసుకుంటా
ABN , First Publish Date - 2022-05-17T07:07:21+05:30 IST
న్యాయం కోసం అత్తారింటి ఎదుట కోడలు వారం రోజులుగా నిరీక్షిస్తోంది. తన కుమార్తెతో కలిసి అక్కడే ఎదురుచూస్తుండగా, భర్త, అత్తా మామ ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయా రు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పోతునూరు గ్రామంలో ఈ సం
నిశ్చితార్ధం అనంతరం యువకుడి డిమాండ్
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
నల్లగొండ జిల్లా హాలియా మండలంలో ఘటన
హాలియా, మే 16: ప్లాటు విక్రయిస్తేనే వివా హం చేసుకుంటానంటూ నిశ్చితార్థం అనంతరం ఓ యువకు డు డిమాండ్ చేయటంతో మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. నల్లగొండ జిల్లా హాలియా మం డలంలోని పంగవానికుంట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. పంగవానికుంటకు చెందిన మెగావత్ వెంకటేశ్వర్లు కుమార్తె నవత(22)కు త్రిపురారం మండలంలోని లకుపతితండాకు చెందిన ధనావత్ జగపతిబాబుతో ఇటీవల వివాహ నిశ్చితార్థమైం ది. కట్నం కింద వరుడికి రూ.20లక్షల విలువైన ప్లాటు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. నవత డిగ్రీ చదువుకోగా, జగపతిబాబు ఆటోడ్రైవర్గా పనిచేస్తుండగా, గతంలోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసేందుకు నిర్ణయించి నిశ్చితార్ధం చేశారు. అయితే వివాహ తేదీని నిర్ణయించలేదు. తన కు ప్లాటు వద్దని, దాని ని విక్రయింయి నగదు ఇవ్వాలని నవతకు జగపతిబాబు కొద్దిరోజులుగా ఫోన్చేసి బెదిరిస్తున్నాడు. విక్రయించి నగదు ఇస్తే నే వివాహం చేసుకుంటానని ఖరా ఖండీగా చెప్పాడు. దీంతో ఈ విషయా న్ని నవత తన సోదరుడికి చెప్పగా, ప్లాటును విక్రయించేది లేదన్నాడు. దీంతో నవత ఎవరికీ చెప్పలేక మనస్తాపంతో సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుంది. ఈ ఘటనపై తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యా దు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. యువతి ఆత్మహత్య చేసుకోవటంతో లకుపతితండాలో ఉన్న జగపతిబాబు అక్కడినుంచి పరారయ్యాడు.