మీటర్లు బిగిస్తే మోటార్లకు వేలాడదీస్తాం: సాకే

ABN , First Publish Date - 2021-02-28T08:34:11+05:30 IST

వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లను అమర్చితే, ఆ మోటార్లకు ప్రభుత్వాన్ని వేలాడదీస్తామని పీసీసీ చీఫ్‌ సాకే శైలజానాథ్‌ హెచ్చరించారు. విజయవాడలో జరిగిన కిసాన్‌ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ

మీటర్లు బిగిస్తే మోటార్లకు వేలాడదీస్తాం: సాకే

విజయవాడ, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లను అమర్చితే, ఆ మోటార్లకు ప్రభుత్వాన్ని వేలాడదీస్తామని పీసీసీ చీఫ్‌ సాకే శైలజానాథ్‌ హెచ్చరించారు. విజయవాడలో జరిగిన కిసాన్‌ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నరేంద్ర మోదీ బినామీ ప్రభుత్వం నడుస్తోందని ధ్వజమెత్తారు. రూ.2లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కును రూ.30వేల కోట్లకు అమ్మేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తనపై ఉన్న కేసులకు భయపడి జగన్‌ కేంద్రం చెప్పే ప్రతిదానికీ తలూపుతున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు విషయంలో తలలు ఊపితే వదిలిపెట్టే ప్రసక్తిలేదని చెప్పారు. ఒక్క కొడుకుగా మినహాయిస్తే.. మిగిలిన విషయాల్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరెత్తే అర్హతే జగన్‌కు లేదన్నారు. అనంతరం కాంగ్రెస్‌ నుంచి గెలిచిన సర్పంచ్‌లను సత్కరించారు.

Updated Date - 2021-02-28T08:34:11+05:30 IST