క్రిప్టో... ఆదాయం రూ. 50 లక్షలు దాటితే...

ABN , First Publish Date - 2022-02-03T21:44:24+05:30 IST

క్రిప్టో ఆదాయం రూ. 50 లక్షలు దాటితే ఇకపై 15 శాతం సర్‌ఛార్జ్‌ పడుతుంది. ఈ(2023) ఆర్ధిక సంవత్సరం నుంచి క్రిప్టోలపై వచ్చిన ఆదాయాన్ని ఆదాయపన్ను రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుంది.

క్రిప్టో... ఆదాయం రూ. 50 లక్షలు దాటితే...

* క్రిప్టో ఆదాయాన్ని ఐటీ రిటర్న్‌ల్లో చూపించాలి...

ముంబై : క్రిప్టో ఆదాయం రూ. 50 లక్షలు దాటితే ఇకపై 15 శాతం సర్‌ఛార్జ్‌ పడుతుంది. ఈ(2023) ఆర్ధిక సంవత్సరం నుంచి క్రిప్టోలపై వచ్చిన ఆదాయాన్ని ఆదాయపన్ను రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. కాగా... పన్ను విధించినంత మాత్రాన... దీనికి చట్టబద్ధత ఇచ్చినట్లు భావించకూడదని కూడా స్పష్టం చేశారు. పన్నుకు, చట్టబద్ధతకు సంబంధం లేదని, చట్టబద్ధత అంశం పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులో ఉంటుందని వివరించారు. ఇక, క్రిప్టో లావాదేవీల్లో నష్టం వాటిల్లినపక్షంలో.. వేరే ఆదాయాలతో సర్దుబాటు చేసుకునే వీలు కూడా ఉండబోదు. 

Updated Date - 2022-02-03T21:44:24+05:30 IST