కరోనా లక్షణాలు ఉంటే తెలియజేయాలి

ABN , First Publish Date - 2020-03-30T11:27:56+05:30 IST

కరోనా లక్షణాలు ఉంటే అఽధికార యంత్రాంగానికి ఆర్‌ఎంపీలు వెంటనే తెలియజేయాలని తహసీల్దార్‌

కరోనా లక్షణాలు ఉంటే తెలియజేయాలి

హుజూర్‌నగర్‌, మార్చి29 :  కరోనా లక్షణాలు ఉంటే అఽధికార యంత్రాంగానికి ఆర్‌ఎంపీలు వెంటనే తెలియజేయాలని తహసీల్దార్‌ జయశ్రీ, డాక్టర్‌ లక్ష్మణ్‌ కోరారు. హుజూర్‌నగర్‌లోని పోలీ్‌సస్టేషన్‌లో ఆర్‌ఎంపీ, పీఎంపీలతో ఆదివారం వారు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వారికి సూచనలు చేశారు. అలాగే గరిడేపల్లి మండలంలో ఉన్న ఆర్‌ఎంపీల దగ్గరికి గ్రామస్థులు ఎవరైనా జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో వస్తే, స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో లేదా పంచాయతీ, రెవెన్యూ కార్యాలయంలో తెలియజేయాలని ఎస్‌ఐ నర్సింగ్‌ వెంకన్న గౌడ్‌ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. 

Updated Date - 2020-03-30T11:27:56+05:30 IST