ముస్లింకు డిప్యూటీ సీఎం ఇస్తే.. ఎస్పీతో కలుస్తాం: అసద్
ABN , First Publish Date - 2021-07-25T06:57:09+05:30 IST
ఉత్తరప్రదేశ్లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతో చేతు లు కలిపేందుకు సిద్ధమేనని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
న్యూఢిల్లీ, జూలై 24: ఉత్తరప్రదేశ్లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతో చేతు లు కలిపేందుకు సిద్ధమేనని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అయితే, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే ముస్లింకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని షరతు విధించారు. ఓం ప్రకాశ్ రాజ్భర్ నేతృత్వం లో చిన్న పార్టీలతో కూడిన భగీదరి సంకల్ప్ మోర్చా లో మజ్లిస్ పార్టీ భాగస్వామ్యంగా ఉంది. ముస్లింకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంపై కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ వంటి ప్రధాన పార్టీలు స్పష్టత ఇవ్వాలని ఎంఐఎం నేత ఆసిమ్ వకార్ డిమాండ్ చేశారు.