ప్రధానిగా ముస్లిం ఎన్నికైతే ఇస్లాంలోకి 50% హిందువులు!

ABN , First Publish Date - 2022-04-04T08:49:16+05:30 IST

యూపీలోని దస్నాదేవీ ఆలయ ప్రధాన పూజారి యతి నర్సింగానంద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

ప్రధానిగా ముస్లిం ఎన్నికైతే ఇస్లాంలోకి 50% హిందువులు!


మిగిలిన హిందువుల్లో 

40% మందిని చంపేస్తారు

దస్నాదేవీ ఆలయ ప్రధాన పూజారి 

నర్సింగానంద్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: యూపీలోని దస్నాదేవీ ఆలయ ప్రధాన పూజారి యతి నర్సింగానంద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు ప్రధానిగా ఓ ముస్లిం ఎన్నికయితే వచ్చే 20 ఏళ్లలో 50ు హిందువులు, ఇస్లాంలోకి మారతారని వ్యాఖ్యానించారు. తమ మనుగడ కోసం హిందువుల్లో ప్రతి ఒక్కరూ ఆయుధం పట్టాలని కూడా పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన ‘హిందూ మహాపంచాయత్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆ ప్రసంగం తాలూకు వీడియో ఒకటి నెట్‌లో వైరల్‌ అవుతోంది. ‘2029లో, లేదంటే 2034లో, లేదంటే 2039లో భారత్‌కు ప్రధానిగా ఓ ముస్లిం ఎన్నిక కావొచ్చు. ఒకసారి ప్రధానిగా ముస్లిం ఎన్నికయితే.. ఆ తర్వాత ఇరవై ఏళ్లలో హిందువుల్లో సగం మంది ఇస్లాంలోకి మారతారు. హిందువుల్లో మిగిలిన వారిలో 40ు మందిని చంపేస్తారు. అప్పుడు మిగిలిన 10ు మంది శరణార్థ శిబిరాల్లో నివసిస్తారు. లేదంటే ఇతర దేశాలకైనా వెళతారు. ఇదీ హిందువుల భవిష్యత్తు. ఇలా జరగకుండా ఉండాలంటే హిందువులంతా ఆయుధాలు చేతబట్టాలి’  అని నర్సింగానంద్‌ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని కవర్‌ చేసేందుకు ఢిల్లీకి చెందిన కొందరు జర్నలిస్టులు వెళ్లగా వాళ్లపై దాడి జరిగిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ముస్లిం వర్గానికి చెందిన ఇద్దరు జర్నలిస్టులపై హిందువుల మూక దాడిచేసినట్లు వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ట్విటర్‌లో ఓ విలేకరి పోస్ట్‌ చేశారు. అయితే తామెవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు పేర్కొనడం విశేషం.  


Updated Date - 2022-04-04T08:49:16+05:30 IST