తెలంగాణలో విగ్రహాల విధ్వంసం.. స్వామి చేతిలోని ఆయుధాలు అపహరణ

ABN , First Publish Date - 2020-09-27T19:09:43+05:30 IST

ఏపీలోనే కాదు తెలంగాణలోనూ దేవతా విగ్రహాల విధ్వంసం జరుగుతోంది. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామ పరిధిలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. స్థానిక మల్లికార్జున స్వామి వారి ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారు.

తెలంగాణలో విగ్రహాల విధ్వంసం.. స్వామి చేతిలోని ఆయుధాలు అపహరణ

మేడ్చల్: ఏపీలోనే కాదు తెలంగాణలోనూ దేవతా విగ్రహాల విధ్వంసం జరుగుతోంది. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామ పరిధిలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. స్థానిక మల్లికార్జున స్వామి వారి ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. బంగారం వస్తువులతో పాటు హుండీలోని నగదును ఎత్తుకెళ్లడంతో పాటు స్వామి వారి చేతిలోని ఆయుధాలను అపహరించారు. ఆలయ పూజారుల సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురు దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి దారుణానికి ఒడిగట్టిన వారిని అరెస్ట్ చేయాలని భక్తులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2020-09-27T19:09:43+05:30 IST