ఇడ్లీలో కప్ప కళేబరం

ABN , First Publish Date - 2021-11-29T16:59:25+05:30 IST

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి బంధు వులు తీసుకెళ్లిన ఇడ్లీలో కప్ప కళేబరం ఉండడాన్ని గుర్తించి దిగ్ర్భాంతి చెందారు. తంజావూరు జిల్లా కుంభకోణం ప్రభుత్వాస్పత్రి రోడ్డులో క్యాంటీన్‌ ఉంది. ఈ ఆస్పత్రి హృద్రోగ విభాగంలో మురుగేశన్‌ చికిత్స

ఇడ్లీలో కప్ప కళేబరం

చెన్నై/ఐసిఎఫ్‌: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి బంధు వులు తీసుకెళ్లిన ఇడ్లీలో కప్ప కళేబరం ఉండడాన్ని గుర్తించి దిగ్ర్భాంతి చెందారు. తంజావూరు జిల్లా కుంభకోణం ప్రభుత్వాస్పత్రి రోడ్డులో క్యాంటీన్‌ ఉంది. ఈ ఆస్పత్రి హృద్రోగ విభాగంలో మురుగేశన్‌ చికిత్స పొందు తున్నాడు. శనివారం క్యాంటీన్‌లో మురుగేశన్‌ బంధువులు నాలుగు ఇడ్లీలు పార్శిల్‌ తీసుకొచ్చారు. మురుగేశన్‌ పార్శిల్‌ విప్పి చూడగా, ఓ ఇడ్లీలో కప్ప కళేబరం ఉండడాన్ని గుర్తించాడు. వెంటనే బంధువులు క్యాంటీన్‌ యజ మాని ముత్తును నిలదీయడంతో ఆ సమయంలో క్యాంటీన్‌లో తింటున్న పలువురు వాగ్వాదానికి దిగారు. వెంటనే ఇడ్లీ పిండిని పారబోసిన ముత్తు క్యాంటీన్‌ను మూసి హడావుడిగా బయటకు వెళ్లిపోయాడు. దీనిపై అందిన ఫిర్యాదుతో ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు.

Updated Date - 2021-11-29T16:59:25+05:30 IST