కళాశాలకు స్థలాలను గుర్తించండి
ABN , First Publish Date - 2021-10-29T05:07:04+05:30 IST
పలాస-కాశీబుగ్గకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైన నేపఽథ్యంలో భవనాల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని టెక్కలి సబ్ కలెక్టర్ వికాస్ మర్మట్ ఆదేశించారు. ఈ మేరకు గురువారం స్థల పరిశీలన చేశారు.
సబ్ కలెక్టర్ వికాస్ మర్మట్
పలాస, అక్టోబరు 28 : పలాస-కాశీబుగ్గకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైన నేపథ్యంలో భవనాల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని టెక్కలి సబ్ కలెక్టర్ వికాస్ మర్మట్ ఆదేశించారు. ఈ మేరకు గురువారం స్థల పరిశీలన చేశారు. సూదికొండ కాలనీ ప్రాంతంలో డంపింగ్ యార్డుకు స్థలం కేటాయించాలని చైర్మన్ బళ్ల గిరిబాబు కోరగా... అక్కడి స్థలాలు పరిశీలించి తక్షణం మునిసి పాలిటీకి అప్పగించాలని సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహణ ప్రస్తుతం జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. శాశ్వత భవనాలు, హాస్టల్ సౌకర్యం కోసం ఏడెకరాల స్థలం అవసరం ఉందని వర్సిటీ అధికారులు రెవెన్యూశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్, చైర్మన్తో కలిసి నెమలికొండ, సూదికొండ ప్రాంతాలను పరిశీలించారు. తహసీల్దార్ మధుసూదనరావు, ముని సిపల్ కమిషనర్ రాజగోపాలరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.