ఏడుపాయల ఆలయంలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తి గుర్తింపు

ABN , First Publish Date - 2022-01-23T00:08:10+05:30 IST

జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల దేవాలయంలో రెండురోజుల క్రితం

ఏడుపాయల ఆలయంలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తి గుర్తింపు

మెదక్: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం  ఏడుపాయల దేవాలయంలో రెండురోజుల క్రితం జరిగిన దొంగతనం కేసులో దొంగను పోలీసులు గుర్తించారు. ఆలయంలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని కామారెడ్డి జిల్లా ఆత్మకూర్ గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో చిలప్‌చెడ్ మండలం శీలంపల్లిలోని ఓ ఇంట్లో  పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆలయ హుండీలో నుంచి ఎత్తుకెళ్లిన నగదు, నగలను శీలంపల్లిలోని అత్తగారి ఇంట్లో దొంగ దాచి పెట్టాడు. దొంగ ఎత్తుకెళ్లిన 2,36,260 నగదు, భక్తులు సమర్పించిన వెండి, బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. లక్ష్మారెడ్డి  పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

 

Updated Date - 2022-01-23T00:08:10+05:30 IST