వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ, పీఎన్‌బీ

ABN , First Publish Date - 2022-08-06T06:31:02+05:30 IST

ఆర్‌బీఐ నిర్ణయం వెలువడిన వెంటనే ఐసీఐసీఐ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) తమ రెపో ఆధారిత రుణాల

వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ, పీఎన్‌బీ

ఆర్‌బీఐ నిర్ణయం వెలువడిన వెంటనే ఐసీఐసీఐ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) తమ రెపో ఆధారిత రుణాల వడ్డీ రేట్లు పెంచేశాయి. రెపో ఆధారిత రుణాల వడ్డీ రేటును పీఎన్‌బీ 7.40 శాతం నుంచి 7.90 శాతానికి పెంచింది. ఈ నిర్ణయం ఈ నెల 8 నుంచి అమల్లోకి వస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ కూడా తన రెపో ఆధారిత రుణాల వడ్డీ రేటును 9.10 శాతానికి పెంచింది. ఈ పెంపు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు బ్యాంక్‌ పేర్కొంది. త్వరలోనే మరిన్ని బ్యాంకులు ఈ రెండు బ్యాంకులను అనుసరించే వీలుంది.

Updated Date - 2022-08-06T06:31:02+05:30 IST