టీ20 ప్రపంచకప్ స్టార్... ఇప్పుడు కరోనా కట్టడి డ్యూటీలో..
ABN , First Publish Date - 2020-03-29T14:03:44+05:30 IST
ఒకప్పుడు తన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను బెంబేలెత్తించడమే డ్యూటీగా పెట్టుకునేవాడు. 2007 టీ20 ప్రపంచకప్లో..
న్యూఢిల్లీ: ఒకప్పుడు తన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను బెంబేలెత్తించడమే డ్యూటీగా పెట్టుకునేవాడు. 2007 టీ20 ప్రపంచకప్లో భారత్ కప్పు గెలుచుకోవడంలోనూ కీలక పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు ఆ క్రికెటర్ మరో కొత్త డ్యూటీ చేస్తున్నాడు. అతడే జోగీందర్ శర్మ. 2007 టీ20 వరల్డ్ కప్లో చివరి ఓవర్ వేసి భారత్కు చిరస్మరణీయ విజయం అందించాడు.
కరోనాతో దేశం మొత్తం అట్టుడికిపోతున్న ఈ పరిస్థితుల్లో హర్యానా డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం లాక్డౌన్ అమలులో ఉండడంతో మిగిలిన పోలీసులతో కలిసి రోడ్లపై ప్రజలు తిరగకుండా కాపలా కాస్తున్నాడు. ఈ నేపథ్యంలో పోలీస్ డ్రెస్లో ఉన్న జోగీందర్ శర్మ ఫోటోను ఐసీసీ తన ట్విటర్ ఖాతా ద్వారా ఆదివారం షేర్ చేసింది. అంతేకాకుండా రియల్ హీరో అంటూ ఆ ఫోటోకు ట్యాగ్లైన్ ఇచ్చింది.