ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన భారత్

ABN , First Publish Date - 2022-05-04T21:44:07+05:30 IST

దుబాయ్: ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత్ సత్తా చాటింది. టీ20ల్లో భారత్‌ 270 పాయింట్లతో మరోమారు టాప్‌లో నిలిచింది.

ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన భారత్

దుబాయ్: ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత్ సత్తా చాటింది. టీ20ల్లో భారత్‌ 270 పాయింట్లతో మరోమారు టాప్‌లో నిలిచింది. 265 పాయింట్లతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో, 261 పాయింట్లతో పాకిస్థాన్ మూడో స్థానంలో, 253 పాయింట్లతో దక్షిణాఫ్రికా 4వ స్థానంలో, 251 పాయింట్లతో ఆస్ట్రేలియా ఐదో స్ధానాల్లో నిలిచాయి.


ఇక టెస్టుల్లో ఆస్ట్రేలియా జట్టు తొలి స్థానంలో నిలవగా భారత్ రెండో స్థానంలో నిలిచింది. న్యూజీలాండ్ మూడో స్థానంలో, దక్షిణాఫ్రికా నాలుగో స్థానంలో, పాకిస్థాన్ ఐదో స్థానంలో నిలిచాయి. 


వన్డేల్లో న్యూజీలాండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ రెండో స్థానంలో ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచాయి. భారత్ నాలుగో స్థానం దక్కించుకోగా పాకిస్థాన్ ఐదో స్థానంలో నిలిచింది. 

Read more