కరోనా బాధితుల సహాయానికి ఐఏఎస్లు
ABN , First Publish Date - 2020-03-29T09:43:15+05:30 IST
దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో... వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయి, అక్కడి క్యాంపుల్లో ఉంటున్న తెలుగువారికి అవసరమైన కనీస ...
అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో... వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయి, అక్కడి క్యాంపుల్లో ఉంటున్న తెలుగువారికి అవసరమైన కనీస సౌకర్యాల కల్పన, సాయం కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి సతీశ్చంద్రను నోడల్ అధికారిగా ప్రభుత్వం నియమించింది. మరోవైపు కరోనా పాజిటివ్ వచ్చి రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో ఉన్నవారి పరిస్థితిని పర్యవేక్షించేందుకు మరో ఐఏఎస్ అధికారి పీయూ్షకుమార్ను నోడల్ అధికారిగా ప్రభుత్వం నియమించింది.