బీసీసీఐ అనుకుంటే ఎలాగైనా గెలుస్తుంది: ఇయాన్ ఛాపెల్
ABN , First Publish Date - 2020-05-23T22:31:23+05:30 IST
అక్టోబర్లో జరగాల్సిన టీ-20 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని తనకు అనిపించడం లేదని.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ అన్నారు. కరోనా వైరస్
అక్టోబర్లో జరగాల్సిన టీ-20 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని తనకు అనిపించడం లేదని.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తాత్కాలికంగా రద్దు అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ను టీ-20 ప్రపంచకప్ స్థానంలో నిర్వహించేందుకు బీసీసీఐ ఏదైనా చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
‘‘అందరూ గుర్తించాల్సిన మొదటి విషయం ఏంటంటే.. బీసీసీఐ కచ్చితంగా గెలుస్తుంది. వాళ్లు అక్టోబర్లో ఆడాలి అనుకుంటే.. అది కచ్చితంగా సాధిస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీ-20 ప్రపంచకప్ యధావిధిగా జరిగే అవకాశాలు నాకైతే కనిపించడం లేదు’’ అని ఛాపెల్ అన్నారు.