నేను YS Jagan ముద్దుల చెల్లెల్ని.. : ఎమ్మెల్యే రోజా
ABN , First Publish Date - 2021-12-22T13:39:15+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తాను ముద్దుల చెల్లెలు అని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు.
చిత్తూరు జిల్లా/నిండ్ర : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తాను ముద్దుల చెల్లెలు అని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. మంగళవారం జగన్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నగరిలో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో సీఎం జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అనాథ బాలికను దత్తత తీసుకుని డాక్టర్ చదివిస్తున్నానని, ఈ సారి వీకేఆర్పురం పంచాయతీలోని మీరాసాహెబ్పాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానన్నారు.
అనంతరం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భర్త సెల్వమణి, రోజా సహోదరులు రాంప్రసాద్రెడ్డి, కుమారస్వామిరెడ్డి, నగరి, పుత్తూరు మున్సిపల్ చైర్మన్లు నీలమేఘం, ఆనంగి శ్రీహరి, ఎంపీపీలు దీప జలంధర్రాజు, విజయలక్ష్మి, మునివేలు, జమునా, భార్గవి తదితరులు పాల్గొన్నారు. నియోజక వర్గంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.