ఐఏఎఫ్ హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్.. పైలట్, సిబ్బంది సేఫ్
ABN , First Publish Date - 2021-11-18T21:28:32+05:30 IST
భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17 హెలిక్టాపర్ ఉత్తర అరుణాచల్ప్రదేశ్లో క్రాష్ ల్యాండింగ్ అయింది. హెలికాప్టర్
ఇటానగర్: భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17 హెలిక్టాపర్ ఉత్తర అరుణాచల్ప్రదేశ్లో క్రాష్ ల్యాండింగ్ అయింది. హెలికాప్టర్ కుప్పకూలిన సమయంలో అందులో ఇద్దరు పైలట్లు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ప్రమాదం నుంచి వారంతా క్షేమంగా తప్పించుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించనున్నట్టు ఎయిర్ఫోర్స్ వర్గాలు తెలిపాయి.
సెప్టెంబరులో జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్ జిల్లా పట్నీటాప్ టూరిస్ట్ రిసార్ట్ వద్ద ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు నెలలో పఠాన్కోట్ సమీపంలోని రంజిత్ సాగర్ డ్యామ్ లేక్లో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో ముగ్గురు పైలట్లు మృతి చెందారు.