నిర్దోషిగా వస్తా.. మళ్లీ మంత్రినవుతా: కేఈ ఈశ్వరప్ప
ABN , First Publish Date - 2022-04-16T01:27:05+05:30 IST
నాపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. దాన్నుండి నేను నిర్దోషిగా బయటపతాను. అయితే విచారణ జరుగుతున్న సమయంలో మంత్రిగా కొనసాగితే దర్యాప్తుపై ప్రభావం పడుతుందనే భావనతో రాజీనామా చేశాను. నిర్దోషిగా బయటకు వస్తా. మరోసారి మంత్రి అవుతా...
బెంగళూరు: సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ ఆత్మహత్య వల్ల తన పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటలకే కర్ణాటక గ్రామీణాభివృద్ధి మంత్రి కేఈ ఈశ్వరప్ప.. ఈ కేసు నుంచి తాను నిర్దోషిగా బయటకు వస్తానని, అనంతరం మళ్లీ మంత్రి పదవి చేపడతానని తన మద్దతుదారులకు పార్టీ కార్యకర్తలకు ఆయన హామీ ఇచ్చారు. శుక్రవారం తన మద్దతుదారులను, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఈశ్వరప్ప మాట్లాడుతూ ‘‘నాపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. దాన్నుండి నేను నిర్దోషిగా బయటపతాను. అయితే విచారణ జరుగుతున్న సమయంలో మంత్రిగా కొనసాగితే దర్యాప్తుపై ప్రభావం పడుతుందనే భావనతో రాజీనామా చేశాను. నిర్దోషిగా బయటకు వస్తా. మరోసారి మంత్రి అవుతా’’ అని అన్నారు.