నన్ను రేప్ చేశారు... అనురాగ్ కశ్యప్‌ పై నటి పాయల్ ఘోష్ ఆరోపణ

ABN , First Publish Date - 2020-09-20T21:56:49+05:30 IST

అనురాగ్ కశ్యప్ తనపౌ అత్యాచారానికి పాల్పడ్డాడని, అంతకుముందు పలుమార్లు లైంగికంగా వేధించాడని ప్రధాని మోదీకి నటి పాయల్ ఘోష్ మొరపెట్టుకున్నారు. తనకు న్యాయం చేయాలని అభ్యర్ధించారు. ‘అనురాగ్ కశ్యప్‌ నాపై బలాత్కారం చేశాడు. నరేంద్ర మోదీజీ... మీరు ఆయనపై చర్యలు తీసుకోవాలి. ఒక సృజనశీలి వెనక ఉన్న అసలు నిజాలు దేశానికి తెలియజేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ విషయం చెప్పడం వల్ల ఆయన నుంచి నాకు ప్రమాదముంటుంది. దయచేసి సహాయం చెయ్యండి’ అని వేడుకుంటూ ఆమె ట్వీట్ చేశారు. కాగా...

నన్ను రేప్ చేశారు... అనురాగ్ కశ్యప్‌ పై నటి పాయల్ ఘోష్ ఆరోపణ

ముంబై : అనురాగ్ కశ్యప్ తనపౌ అత్యాచారానికి పాల్పడ్డాడని, అంతకుముందు పలుమార్లు లైంగికంగా వేధించాడని ప్రధాని మోదీకి నటి పాయల్ ఘోష్ మొరపెట్టుకున్నారు. తనకు న్యాయం చేయాలని అభ్యర్ధించారు. ‘అనురాగ్ కశ్యప్‌ నాపై బలాత్కారం చేశాడు. నరేంద్ర మోదీజీ... మీరు ఆయనపై చర్యలు తీసుకోవాలి. ఒక సృజనశీలి వెనక ఉన్న అసలు నిజాలు దేశానికి తెలియజేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ విషయం చెప్పడం వల్ల ఆయన నుంచి నాకు ప్రమాదముంటుంది. దయచేసి సహాయం చెయ్యండి’ అని వేడుకుంటూ ఆమె ట్వీట్ చేశారు. కాగా...


పాయల్‌ ట్వీట్‌ను నటి కంగనా రనౌత్ రీట్వీట్ చేశారు, ‘#మీ టూ’  హ్యాష్‌ట్యాగ్‌తో... ’ప్రతీ గొంతూ ముఖ్యమైనదే. అనురాగ్ కశ్యప్‌ను అరెస్ట్ చేయండి’ అని ఆమె డిమాండ్‌ చేశారు. డగాజజజ పాయల్‌ ఘోష్‌ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ... దీనిపై సమాచారమివ్వాల్సిందిగా పాయల్‌ను కోరారు. ‘మీరు మీ ఫిర్యాదును ncw@nic.in, @NCWIndia ద్వారా నాకు పంపొచ్చు’ అని రేఖాశర్మ ట్వీట్‌ చేశారు. తన ట్వీట్‌ను సుమోటో ఫిర్యాదుగా స్వీకరించడంపై రేఖాశర్మకు పాయల్‌ ఘోష్‌ ధన్యవాదాలు తెలిపారు.


వివరాలు పంపిస్తాననన్నారు. కాగా... ‘నా నోరు మూయించడానికి మరో్ మహిళను ఉసిగొలుపుతున్నారు’ అంటూ కంగనపై కశ్యప్ ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై అనురాగ్‌ కశ్యప్‌ రాత్రి 12.38 నిమిషాలకు హిందీలో రాసిన నాలుగు ట్వీట్ల ద్వారా స్పందించారు. ’భలే చెప్పారు. నా నోరు మూయించడానికి చాలా సమయం పట్టినట్టుంది’ అని రాశారు. ‘నా నోరు మూయించడానికి ఓ మహిళ మరో మహిళతో అబద్ధం చెప్పించారు. ఆమె ఇతర మహిళలను కూడా వివాదాల్లోకి లాగారు. కొంచెం మర్యాద కాపాడుకోండి మేడం. మీ ఆరోపణలన్నీ అబద్ధాలు’ అనంటూ కశ్యప్‌ ఘాటుగా ట్వీట్‌ చేశారు.


‘నాపై ఆరోపణలు చేసేటప్పడు నాతో పని చేసే నటీనటులను, అమితాబ్‌ కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగడం సరి కాదు. నేను రెండు పెళ్లిళ్లు చేసుకున్నానని అంటున్నారు. అది మా ఇష్ట ప్రకారమే జరిగింది. మా మధ్య ప్రేమ ఉంది, అందుకే పెళ్లి చేసుకున్నాం’ అని కశ్యప్‌ పేర్కొన్నారు. నాకు ఒక భార్య ఉందా ? ఇద్దరు భార్యలున్నారా ? గర్ల్స్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారా ? అన్న విషయాలు ప్రస్తుతానికి అప్రస్తుతం. నేను చాలామంది మహిళలతో కలిసి పని చేస్తుంటాను. చాలామంది నటీమణులు నాకు తెలుసు. వాళ్లతో కలిసి పదిమందిలో పని చేసినా, ఒంటరిగా పని చేసినా నేనెప్పుడూ చెడుగా ప్రవర్తించలేదు. ఎవరైనా అలా చేసినా కూడా నేను సహించలేను’ అని తన ట్వీట్ లో కశ్యప్ వ్యాఖ్యానించారు. 


‘ఏం జరుగుతుందో చూద్దాం. ఆ వీడియోలో ఆమె చెప్పింది ఎంత నిజమో త్వరలోనే తేలుతుంది. ఈ ఆరోపణల నుంచి నేను బయటకొస్తాను’ అని కశ్యప్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా ఈ వివాదం నేపధ్యంలో... బాలీవుడ్‌ రెండు వర్గాలుగా విడిపోయింది. ఈ వివాదంలో అనురాగ్‌ కశ్యప్‌ కేంద్ర బిందువుగా మారారు. నటి కంగనా రనౌత్‌ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. అనురాగ్, కంగనల మధ్య తరచూ సోషల్ మీడియాలో వాదోపవాదాలు జరుగుతూ వస్తున్నాయి. కాగా... పాయల్‌ ఘోష్‌... 2017 లో 'పటేల్ పంజాబీ షాదీ' చిత్రంలో నటుడు పరేష్ రావల్ కుమార్తెగా తొలిసారి కనిపించారు బాలీవుడ్‌ సినిమాలలో మాత్రం పెద్దగా కనిపించలేదు. దక్షిణాదిలో కొన్ని సినిమాలలో, అదీ ఎక్కువగా తెలుగులో నటించింది. ఊసరవెల్లి, మిస్టర్‌ రాస్కెల్‌, ప్రయాణం తదితర సినిమాల్లో నటించారు. సాథ్‌ నిభానా, సాథియా 2 అనే టెలీవిజన్‌ షోలో ఆమె కనిపించారు.


Updated Date - 2020-09-20T21:56:49+05:30 IST