భారత్ విశ్వబికారీ అవుతోంది : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్

ABN , First Publish Date - 2021-06-25T21:33:10+05:30 IST

రానూ రానూ భారత్ విశ్వ బికారీగా మారిపోతోందంటూ పంజాబ్ పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఐదు ట్రిలియన్

భారత్ విశ్వబికారీ అవుతోంది : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్

న్యూఢిల్లీ : రానూ రానూ భారత్ విశ్వ బికారీగా మారిపోతోందంటూ పంజాబ్ పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఐదు ట్రిలియన్ డాలర్ల వ్యాపారంతో భారత్ విశ్వగురు స్థానాన్ని అందుకుంటుందని కేంద్రం పదే పదే చెబుతోందని, కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోందని సునీల్ జఖర్ మండిపడ్డారు. విశ్వగురు స్థానంలో కాకుండా భారత్ రానూ రానూ ‘విశ్వ బికారీ’ గా మారిపోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ ప్రతి దేశం నుంచి సాయం తీసుకుంటోందని, ఇతర దేశాల నుంచి ఆక్సిజన్ విమానాలు భారత్‌కు వస్తున్నాయని, దీన్ని బట్టే అర్థమైపోతోందని సునీల్ జఖర్ విమర్శించారు. 

Updated Date - 2021-06-25T21:33:10+05:30 IST