ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
ABN , First Publish Date - 2021-01-26T05:56:34+05:30 IST
జీపీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు కౌన్సెలింగ్ ప్రారంభమైందని కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కిషోర్ కుమార్ తెలిపారు.
కర్నూలు(ఎడ్యుకేషన్), జనవరి 25: జీపీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు కౌన్సెలింగ్ ప్రారంభమైందని కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కిషోర్ కుమార్ తెలిపారు. ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు కౌన్సెలింగ్ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుందని, ఫిబ్రవరి 2న అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు.