మోదీని ఢిల్లీ నుంచి పంపేయాలని అనలేదు: సీఎం మమత

ABN , First Publish Date - 2020-06-06T01:29:51+05:30 IST

మోదీని డిల్లీ నుంచి పంపించేయాలని తానెప్పడూ అనలేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ...

మోదీని ఢిల్లీ నుంచి పంపేయాలని అనలేదు: సీఎం మమత

కలకత్తా: మోదీని డిల్లీ నుంచి పంపించేయాలని తానెప్పడూ అనలేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఆంఫన్ తుఫాను వంటి విపత్తు నుంచి ఇటీవలే కోలుకున్నామని, ఇంకా కరోనా దేశాన్ని వీడలేదని, అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేయడం హేయమని ఆవేదన వ్యక్తం చేశారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేలో భాగంగా జరిగిన ‘రీ గ్రీనింగ్ కోల్’కార్యక్రమంలో మమత పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, ‘ప్రకృతి విపత్తుల వల్ల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ జీవిస్తున్నారు. ఈ సమయంలో వారికి అండగా నిలబడకుండా మా ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయ’ని పేర్కొన్నారు. ఇది రాజకీయాలకు సమయం కాదని, ప్రజలకు అందరూ అండగా నిలవాలని మమత పిలుపునిచ్చారు.

Updated Date - 2020-06-06T01:29:51+05:30 IST