నాకు సంబంధం లేదు
ABN , First Publish Date - 2022-05-29T08:37:06+05:30 IST
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనా రాయణ రెడ్డి కుమార్తె లీలాకైవల్య తన భర్త రితీష్రెడ్డితో శని వారం ఒంగోలు మహానాడులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను కలవడం చర్చనీయాంశమైంది.
లోకేష్ను కుమార్తె కలవడంపై ఆనం స్పందన
వెంకటగిరిటౌన్,మే 28 : వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనా రాయణ రెడ్డి కుమార్తె లీలాకైవల్య తన భర్త రితీష్రెడ్డితో శని వారం ఒంగోలు మహానాడులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను కలవడం చర్చనీయాంశమైంది.నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఉప ఎన్నికల్లో, అలాగే 2024 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ అడిగినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఈ విషయంపై వెంకటగిరిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆనం రామనారాయణ రెడిన్డి అడగ్గా ‘ నాకు సంబంధం లేదు. మీరు బద్వేల్కు వెళ్లి వాళ్లనే అడగండి’ అని సమాధానం ఇచ్చారు. కడప జిల్లా బద్వేల్కు చెందిన మాజీ మంత్రి వీరారెడ్డి కోడలు లీలాకైవల్య అన్న విషయం తెలిసిందే. వీరారెడ్డి కుటుంబం ఎప్పట్నుంచో టీడీపీలోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.