సమస్యల పరిష్కారానికే ‘మీతో నేను..’
ABN , First Publish Date - 2021-04-13T05:23:34+05:30 IST
సమస్యల పరిష్కారానికే ‘మీతో నేను..’
బంట్వారం: ప్రజా సమస్యల పరిష్కారానికే ‘మీతో నేను’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. సోమవారం సల్బత్తాపూర్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. వికలాంగులందరూ సదరం క్యాంప్ నుంచి సర్టిఫికెట్ పొంది పింఛన్ అందేలా చూడాలని సెక్రటరీని ఆదేశించారు. ఓపెన్ ట్రాన్స్ఫార్మర్లకు ఫెన్సింగ్ వేయాలని ట్రాన్స్కో అధికారులను, మురుగు నిల్వ ఉండకుండా చూడాలని సర్పంచ్ను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న లైన్మన్పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. సర్పంచ్ వెంకటమ్మ, ఎంపీటీసీ సంధ్యారాణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, సొసైటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్ మల్లేషం, రైతు సమితి అధ్యక్షుడు ఖాజాపాషా, బల్వంత్రెడ్డి, రాములుయాదవ్, నర్సింహారెడ్డి, ఎల్లయ్య, శ్రీనివాస్, సుదర్శన్రెడ్డి, రాజేందర్రెడ్డి పాల్గొన్నారు.