అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిని నేనే!

ABN , First Publish Date - 2021-10-18T07:22:08+05:30 IST

తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే స్వర్ణోత్సవాలను జరుపుకొంటున్న వేళ మాజీ...

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిని నేనే!

శిలాఫలకం ఆవిష్కరించిన శశికళ 

చెన్నై, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే స్వర్ణోత్సవాలను జరుపుకొంటున్న వేళ మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ఆ పార్టీకి తానే ప్రధాన కార్యదర్శినంటూ ప్రకటించుకున్నారు. టి.నగర్‌లో అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ స్మారక మందిరం వద్ద ఆమె ఆ పార్టీకి పోటీగా ఆదివారం స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించారు. పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఓ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ శిలాఫలకంలో అన్నాడీఎంకే ‘ప్రధాన కార్యదర్శి వీకే శశికళ’ అంటూ పెద్ద అక్షరాలతో చెక్కి ఉండటం అందరినీ విస్మయానికి గురిచేసింది. కాగా.. శిలాఫలకంలో పేరు వేసుకున్నంత మాత్రాన శశికళ ప్రధాన కార్యదర్శి కాలేరని మాజీ మంత్రి డి. జయకుమార్‌ విమర్శించారు.

Updated Date - 2021-10-18T07:22:08+05:30 IST