Mlc Kavitha: మోదీ టార్గెట్ నేను కాదు కేసీఆర్: కవిత
ABN , First Publish Date - 2022-08-28T01:08:07+05:30 IST
ప్రధాని మోదీ టార్గెట్ నేను కాదు సీఎం కేసీఆర్. నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ లేని తెలంగాణ లేదు.
హైదరాబాద్: ‘‘ప్రధాని మోదీ టార్గెట్ నేను కాదు సీఎం కేసీఆర్. నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ లేని తెలంగాణ లేదు. ఢిల్లీలో ఏం జరిగిందో నాకు స్పష్టమైన సమాచారం ఉంది’’ అని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్ ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) ప్రకటించారు. తనపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని తప్పుబట్టారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) అయిందో లేదో తెలియదని తోచిపుచ్చారు. ఆధారాలు లేని ఆరోపణలకు ఊతం ఇవ్వరాదన్నారు. కోర్టు చెప్పిన తరువాత కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ, ఈడీ (CBI ED)ని జేబు సంస్థగా వాడుకుంటున్నారని ఆరోపించారు. 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందని, తెలంగాణలోనూ బీజేపీ (BJP) కుట్ర రాజకీయాలు చేస్తోందని కవిత దుయ్యబట్టారు. కేసీఆర్ అంటే బీజేపీ సర్కార్కు భయమని, అందుకే ఆయన పక్కన ఉండేవారిని ఇబ్బంది పెడుతున్నారని కవిత విమర్శించారు.