డ్రోన్ సాయంతో హైపోక్లోరైడ్ పిచికారీ
ABN , First Publish Date - 2021-05-17T06:34:28+05:30 IST
మండలంలోని అడుసుమిల్లి గ్రామంలో తొలిసారి డ్రోన్ను వినియోగించి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని చల్లించడాన్ని మండల టీడీపీ నేతలు అభినందించారు.
కామవరపుకోట, మే 16: మండలంలోని అడుసుమిల్లి గ్రామంలో తొలిసారి డ్రోన్ను వినియోగించి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని చల్లించడాన్ని మండల టీడీపీ నేతలు అభినందించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా సొంత ఖర్చుతో సర్పంచ్ గుడిపాటి కేశవరావు ఈ కార్యక్రమం చేపట్టడం గ్రామాభివృద్ధి పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని టీడీపీ నాయకుడు కిలారి సత్యనారాయణ అన్నారు.