టీఆర్‌ఎస్‌ చీఫ్‌గా కేసీఆర్‌.. మరో 3 సెట్ల నామినేషన్లు దాఖలు

ABN , First Publish Date - 2021-10-19T08:27:06+05:30 IST

టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌ పేరును ప్రతిపాదిస్తూ సోమవారం ఆ పార్టీ నేతలు వేర్వేరుగా మరో మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు.

టీఆర్‌ఎస్‌ చీఫ్‌గా కేసీఆర్‌.. మరో 3 సెట్ల నామినేషన్లు దాఖలు

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌ పేరును ప్రతిపాదిస్తూ సోమవారం ఆ పార్టీ నేతలు వేర్వేరుగా మరో మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి, పర్యవేక్షణాధికారి పర్యాద కృష్ణమూర్తికి వాటిని అందజేశారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక సెట్‌ వేయగా, మునిసిపల్‌ కార్పొరేషన్ల మేయర్లు మరోసెట్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌తో పాటు, పార్టీ ఎమ్మెల్యేలు ఇంకో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. 

Updated Date - 2021-10-19T08:27:06+05:30 IST