కేసీఆర్‌ బొమ్మకు ఓటేసే రోజులు పోయాయ్‌

ABN , First Publish Date - 2021-10-19T07:26:56+05:30 IST

కేసీఆర్‌ బొమ్మతో హుజూరాబాద్‌లో గెలుస్తామని టీఆర్‌ఎస్‌ వాళ్లు అనుకుంటున్నారని, ఆయన బొమ్మకు ఓటు పడే రోజులు పోయాయని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు.

కేసీఆర్‌ బొమ్మకు ఓటేసే రోజులు పోయాయ్‌

నాది కారు గుర్తు అని దుష్ప్రచారం: ఈటల

వీణవంక, అక్టోబరు 18: కేసీఆర్‌ బొమ్మతో హుజూరాబాద్‌లో గెలుస్తామని టీఆర్‌ఎస్‌ వాళ్లు అనుకుంటున్నారని, ఆయన బొమ్మకు ఓటు పడే రోజులు పోయాయని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. గ్రామాల్లో కేసీఆర్‌కు ముఖం చెల్లక, రాజేందరన్న పేరు చెబితేనే ఓట్లు పడతాయని.. ఈటలది కారు గుర్తు అని చెబుతున్నారని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలోని గంగారం, ఎలబాక, మామిడాలపల్లి, చల్లూరు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మూడేళ్లుగా డీడీలు కట్టినా గొల్ల, కురుమలకు గొర్లు ఇవ్వలేదని, తన రాజీనామా తర్వాతనే హుజూరాబాద్‌ ప్రజలకు గొర్లు ఇచ్చారని చెప్పారు. అది వారిపైన ప్రేమకాదని, ఓట్ల మీద ప్రేమ అని అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యేకు టికెట్‌ ఇప్పించానని, ఆయన గెలవడానికి ప్రచారం చేశానని, ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి తనను ఓడగొట్టేందుకు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రాజేందరన్నకు కేసీఆర్‌ అన్యాయం చేశారని హుజూరాబాద్‌ ప్రజలు ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నారని చెప్పారు.

Updated Date - 2021-10-19T07:26:56+05:30 IST