నైజీరియన్స్‌పై హైదరాబాద్‌ పోలీసుల కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-06-29T23:30:43+05:30 IST

వీసాల గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే ఉంటున్న నైజీరియన్స్‌ను వారి దేశాలకు పంపించాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు.

నైజీరియన్స్‌పై హైదరాబాద్‌ పోలీసుల కీలక నిర్ణయం

హైదరాబాద్: వీసాల గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే ఉంటున్న నైజీరియన్స్‌ను వారి దేశాలకు పంపించాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు.హైదరాబాద్‌లో ఉంటూ నైజీరియన్స్ పలు నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ కేసుల్లో వారి పేర్లే అధికంగా వినిపిస్తున్నాయి. డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి నేరాలను అరికట్టేందుకు ఇక నుంచి నైజీరియన్స్‌పై కేసులు నమోదు చేయకుండా వారి దేశాలకు అప్పగించాలని హైదరాబాద్‌ పోలీసుల నిర్ణయించారు. ఫ్లైట్ టికెట్ బుక్ చేసి వారి దేశాలకు అప్పగించాలని భావిస్తున్నారు.హైదరాబాద్‌లో మొత్తం 2500 మంది నైజీరియన్స్‌ ఉండగా వీరిలో 750 మందికి వీసా గడువు ముగిసినట్లు పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకుని వారిదేశాలకు పంపించడం వల్ల నేరాల సంఖ్యతగ్గే అవకాశం వుందని పోలీసులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-06-29T23:30:43+05:30 IST