HYD: ఇందిరాపార్క్ వద్ద టీపీసీసీ మౌన దీక్ష ప్రారంభం
ABN , First Publish Date - 2021-10-11T16:57:18+05:30 IST
నగరంలోని ఇందిరాపార్క్ వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష ప్రారంభమైంది.
హైదరాబాద్: నగరంలోని ఇందిరాపార్క్ వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష ప్రారంభమైంది. ఉత్తర్ ప్రదేశ్లోని లఖిమ్ పూర్లో దీక్ష చేస్తున్న రైతులపై నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు కార్తో తొక్కించి హత్య చేసిన సంఘటనకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ దీక్ష చేపట్టింది. ఆజయ్ మిశ్రాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, పీఏసీ కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావ్, అధికార ప్రతినిధులు మానవతా రాయ్, సుధీర్ రెడ్డి, రవళి రెడ్డి, ఫిషేర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్, డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి, సేవాదల్ ఛైర్మన్ ప్రసాద్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. మరికాసేపట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దీక్షలో కూర్చోనున్నారు.