Hyderabad: డ్రగ్స్ కేసులో మొదటి రోజు ముగిసిన విచారణ

ABN , First Publish Date - 2022-04-15T00:54:02+05:30 IST

Hyderabad: డ్రగ్స్ కేసులో మొదటి రోజు ముగిసిన విచారణ

Hyderabad: డ్రగ్స్ కేసులో మొదటి రోజు ముగిసిన విచారణ

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో మొదటి రోజు విచారణ ముగిసింది. పబ్ మేనేజర్ అనిల్, ఓనర్ అభిషేక్‌ను పోలీసులు విచారించారు. 6 గంటలుగా విడివిడిగా ఇద్దరిని పోలీసులు విచారించారు. అనిల్, అభిషేక్ వ్యక్తిగత సమాచారం సేకరించినట్లు పోలీసులు తెలిపారు. అనిల్, అభిషేక్ నుంచి సీజ్ చేసిన ఫోన్స్ డేటా వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పబ్ భాగస్వాములు, అగ్రిమెంట్స్‌పై విచారణ చేపట్టారు. పబ్‌లో దొరికిన డ్రగ్స్‌పై అనిల్‌ను ప్రశ్నిచినట్లు పోలీసులు పేర్కొన్నారు. అభిషేక్ సీడీఆర్‌ లిస్ట్‌ ఆధారంగా దర్యాప్తు అధికారులు ప్రశ్నలు సంధించారు. పబ్‌కు వచ్చిన కస్టమర్ల వివరాలపై అభిషేక్‌ను ప్రశ్నించినట్లు పోలీసులు చెప్పారు. ఇప్పటికే గుర్తించిన 10 మంది డ్రగ్స్ పెడ్లర్స్‌ కోణంలో విచారణ చేశారు. నలుగురు ఇన్‌స్పెక్టర్లు, ఏసీపీ సమక్షంలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2022-04-15T00:54:02+05:30 IST