మంత్రి సబిత వ్యాఖ్యలపై ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాల స్పందన

ABN , First Publish Date - 2021-10-21T18:35:48+05:30 IST

పరీక్షల టైమ్‌లో ఇబ్బందులు పెట్టొద్దన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు స్పందించాయి.

మంత్రి సబిత వ్యాఖ్యలపై ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాల స్పందన

హైదరాబాద్: పరీక్షల టైమ్‌లో ఇబ్బందులు పెట్టొద్దన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు స్పందించాయి. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్షుడు గౌరీ సతీష్ మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాల నుంచి బకాయిలు రూ.315 కోట్లు విడుదల చేయాలన్నారు. ఇప్పటికే 300కు పైగా కాలేజీలు మూత పడ్డాయని తెలిపారు. హాల్ టికెట్స్‌పైన ప్రిన్సిపల్ సంతకాన్ని ఆమోదించాలని కోరారు. తాము పంతాలకు పోవడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం దయచేసి తమ సమస్యలను పరిష్కరించాలని గౌరీ సతీష్ వినతి చేశారు. 

Updated Date - 2021-10-21T18:35:48+05:30 IST