Hyderabadలో పెరిగిపోతున్న సైబర్ నేరాల బాధితులు
ABN , First Publish Date - 2021-10-19T15:11:46+05:30 IST
నగరంలో సైబర్ నేరాల బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఓఎల్ఎక్స్, ఓటీపీ, క్యూఆర్ కోడ్ నేరాలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
హైదరాబాద్: నగరంలో సైబర్ నేరాల బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఓఎల్ఎక్స్, ఓటీపీ, క్యూఆర్ కోడ్ నేరాలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సనత్ నగర్కు చెందిన డిజైనర్ ఓఎల్ఎక్స్లో రిఫ్రిజిరేటర్ను అమ్మకానికి పెట్టగా క్యూ అర్ కోడ్ పంపి దఫదఫాలుగా సైబర్ నిందితులు ఏడు లక్షలు కాజేశారు. అటు ఓల్డ్ ఆల్వాల్కు చెందిన బ్యాంకు ఉన్నతాధికారి సోఫా అమ్మకానికి పెట్టగా మూడున్నర లక్షలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. అలాగే కౌకూర్కు చెందిన ఓ వ్యాపారికి వాట్సాప్ ద్వారా బిజినెస్ ఆఫర్ అంటూ మభ్యపెట్టి దాదాపు రూ.46 లక్షల వరకు నిందితులు నొక్కేశారు. చందానగర్కు చెందిన ఉద్యోగికి కేబీసీ లాటరీ పేరుతో టోకరా ఇచ్చారు. సైబర్ నిందితులను నమ్మి నిందితుడు దాదాపు రూ.15 లక్షలు పోగొట్టుకున్నాడు. సైబర్ నిందితులు పండుగ సీజన్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.