HYD: బేగంబజార్ పరువు హత్య కేసులో పురోగతి
ABN , First Publish Date - 2022-05-21T13:47:14+05:30 IST
బేగంబజార్ పరువు హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. నీరజ్ పర్వాన్ను హత్య చేసిన ఐదుగురు నిందితులను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: బేగంబజార్ పరువు హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. నీరజ్ పర్వాన్ను హత్య చేసిన ఐదుగురు నిందితులను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య అనంతరం కర్నాటకకు పారిపోయిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో నీరజ్పై దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. నీరజ్ పన్వార్ను దాదాపు 20 సార్లు కత్తులతో పొడిచి చంపారు. ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకోవడంతో యువకుడిపై యువతి కుటుంబీకులు కక్షగట్టారు. చివరకు పక్కా పథకం ప్రకారం నిన్న(శుక్రవారం) నడిరోడ్డుపై యువకుడిని అడ్డగించి కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనపై టాస్క్ఫోర్స్ సహా నాలుగు బృందాలతో దర్యాప్తు కొనసాగింది. 10 మందిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.