Hyderabad: మూడు రోజులుగా తల్లి మృతదేహంతో కుమారుడు

ABN , First Publish Date - 2022-05-14T16:31:49+05:30 IST

నగరంలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపూరి కాలనీలోని దారుణం జరిగింది. మైత్రి నివాస్ అపార్టుమెంట్‌లోని 202 నెంబర్ ఫ్లాట్‌లో కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది.

Hyderabad: మూడు రోజులుగా తల్లి మృతదేహంతో కుమారుడు

హైదరాబాద్: నగరంలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపూరి కాలనీలోని దారుణం జరిగింది. మైత్రి నివాస్ అపార్టుమెంట్‌లోని 202 నెంబర్ ఫ్లాట్‌లో కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. తల్లి మృతదేహంతో పాటు మూడు రోజులుగా అపార్ట్‌మెంట్‌లోనే కుమారుడు ఉన్నాడు. సాయి కృష్ణ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదని తరచూ తల్లి, కొడుకులు గొడవ పడేవారని స్థానికులు చెబుతున్నారు. కొడుకు మానసిక స్థిమితం బాగా లేకపోవడంతో  కొడుకే తల్లిని హత్య చేసి ఉండొచ్చని తెలిపారు. ఫ్లాట్ నుండి దుర్వాసన వస్తుండడంతో అపార్ట్‌మెంట్ వాసులు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన మహిళ విజయ(50) అని అపార్ట్‌మెంట్ వాసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

Read more