HYD: బొలేరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-04-25T17:05:19+05:30 IST
నగరంలోని హయత్నగర్లో బైక్పై వెళ్తున్న వ్యక్తిని బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రఘురామ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
హైదరాబాద్: నగరంలోని హయత్నగర్లో బైక్పై వెళ్తున్న వ్యక్తిని బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రఘురామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. హైదరాబాద్ హయత్నగర్ కుంట్లర్ మదర్ డైరీ వద్ద నిన్న రాత్రి ప్రమాదం జరిగింది. రాత్రి బైక్పై వెళ్తున్న రఘురామ్ను బోలోరా వాహనం ఢీకొట్టింది. మృతుడు రఘురామ్ మెట్రో స్టేషన్లో విధులు ముగించుకుని తన నివాసం కుంట్లర్ గణేష్ నగర్కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. బోలోరో డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని నడిపి నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం డ్రైవర్ ఫరారీలో ఉన్నట్లు సమాచారం.