హైదరాబాద్ విజయ లక్ష్యం 155 పరుగులు
ABN , First Publish Date - 2020-10-23T02:58:36+05:30 IST
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ రాజస్థాన్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. రాజస్థాన్ బ్యాటింగ్ తొలుత బాగానే ఉన్నప్పటికీ చివర్లో లయ తప్పింది
దుబాయ్: సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసి ప్రత్యర్థి ఎదుట ఓ మాదిరి విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ రాజస్థాన్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. రాజస్థాన్ బ్యాటింగ్ తొలుత బాగానే ఉన్నప్పటికీ చివర్లో లయ తప్పింది. 12 ఓవర్లలో 86/3తో బలంగా ఉన్నట్టు కనిపించిన రాజస్థాన్ ఆ తర్వాత వరుసపెట్టి వికెట్లు చేజార్జుకుంది.
అదే సమయంలో హైదరాబాద్ బౌలర్లు, ముఖ్యంగా జానస్ హోల్డర్ నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్మెన్ను కట్టడి చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న సంజు శాంసన్ (36), స్టీవ్ స్మిత్ (19), రియాన్ పరాగ్ (20)లను పెవిలియన్ పంపాడు. డెత్ ఓవర్లలో పరుగులు పిండుకోవడంలో రాజస్థాన్ బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. ఫలితంగా 154 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగిసింది. రాబిన్ ఉతప్ప 19, బెన్ స్టోక్స్ 30, జోస్ బట్లర్ 9, రాహుల్ తెవాటియా 2 పరుగులు చేశారు. చివర్లో జోఫ్రా అర్చర్ 7 బంతుల్లో ఫోర్, సిక్సర్తో 16 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 150 పరుగులు దాటింది.