Hyderabad: గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-06-02T16:08:54+05:30 IST
నగరంలోని గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపుతోంది.
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. జమ్మూ కాశ్మీర్కు చెందిన కృతి సంబ్యాల్(27) గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. నానకరాంగుడాలోని ఓ అపార్ట్మెంట్లో ఇద్దరు రూమ్ మేట్స్తో కలిసి కృతి నివసిస్తోంది. అయితే రూమ్లో ఎవరూ లేని సమయంలో కృతి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్నేహితుడు సచిన్ కుమార్కు ఉద్యోగిని మెసేజ్ పంపింది. వెంటనే సచిన్ అపార్ట్మెంట్ రాగా... కృతి ఉరికి వేలాడుతూ కనిపించింది. హుటాహుటిన హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా... కృతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.