దంపతుల అమానుషం...కాళ్లు పట్టుకున్నా వదలని వైనం

ABN , First Publish Date - 2020-02-19T16:14:27+05:30 IST

దంపతుల అమానుషం...కాళ్లు పట్టుకున్నా వదలని వైనం

దంపతుల అమానుషం...కాళ్లు పట్టుకున్నా వదలని వైనం

హైదరాబాద్: నగరంలోని సనత్‌నగర్ ప్రభుత్వ పాఠశాల వద్ద దారుణం చోటు చేసుకుంది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని ఓ  మహిళ విచక్షణారహితంగా కొట్టింది. అమానుషంగా దాడి చేసింది. రౌండ్ టేబుల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆడుకుంటూ ఉండగా అటు నుంచి ఓ జంట వెళుతోంది. ఆడుకుంటున్న విద్యార్థుల్లో ఒకరిపై భార్యాభర్త విచక్షణారహితంగా దాడి చేశారు. ఇది చూసిన విద్యార్థి స్నేహితుడు వచ్చి...కొట్టొద్దు, ఏం చేయలేదు అంటూ వారిని బతిమిలాడాడు. అదే సమయంలో బాధిత విద్యార్థి దంపతుల కాళ్లు పట్టుకున్నాడు. అయినా వారు కనికరించలేదు. లేబర్ పిల్లలు, చిల్లరగాళ్లు అంటూ విద్యార్థులపై దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సీసీ టీవీ దృశ్యాలను చూసిన పోలీసులకు అసలు విషయమేంటో అర్ధమైంది. విద్యార్థులపై దాడి చేయడమే కాకుండా ఫిర్యాదు చేసిన దంపతులపై పోలీసులు కేసు పెట్టి, వారిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2020-02-19T16:14:27+05:30 IST